న్యూదిల్లీ : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆయన పదవీకాలం 2027 డిసెంబరు వరకు ఉంది. అయితే రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. 1985 పంజాబ్ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి గోయల్… 2022 నవంబరులో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులయ్యారు. ఫిబ్రవరిలో అనుప్ పాండే పదవీ విరమణ, ప్రస్తుతం గోయల్ రాజీనామాతో… ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు .