. దోషుల విడుదల చట్టవిరుద్ధం
. 11 మంది దోషులు రెండు వారాల్లో లొంగిపోవాలి
. బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు
న్యూదిల్లీ : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అత్యున్నత న్యాయ స్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆ కేసులో 11 మంది రేపిస్టులను ముందుగా విడుదల చేయడాన్ని తప్పుపట్టింది. గుజరాత్ ప్రభుత్వం మంజూరు చేసిన క్షమాభిక్షను న్యాయస్థానం రద్దు చేసింది. ఆ 11 మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సమర్థించింది. ‘ఈ కేసులో పిటిషనర్ బానో రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద తన రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కుతో వ్యవహరించే 14వ అధికరణ ప్రకారం తన ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి, సమానత్వం, చట్టాల సమాన రక్షణ’ అని వ్యాఖ్యానించింది.
2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబాన్ని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మందిని ముందస్తుగా విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. కాగా, న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అక్టోబరు 2023లో తీర్పు కోసం కేసును రిజర్వ్ చేసింది. సీపీఎం నాయకులు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా సహా బిల్కిస్ బానో, ఇతరులు వేర్వేరుగా దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కోర్టు విచారించింది. ఈ కేసులో ఖైదీలకు ఉపశమనం (శిక్షాకాలం తగ్గింపు) మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆ 11 మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున… దోషులకు ఉపశమనం మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఉపశమనం కోరుతూ దోషి చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ 2002 మార్చిలో సుప్రీం కోర్టు మరో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపైనా తాజా ధర్మాసనం స్పందించింది. వాస్తవాలను దాచి, మోసపూరిత మార్గాల ద్వారా దోషి ఆ ఆదేశాలను పొందాడని పేర్కొంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న… గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను గుజరాత్ అపహరించినట్లు పేర్కొన్నారు. క్షమాభిక్షను ఇవ్వడం అంటే మహారాష్ట్ర అధికారాన్ని గుజరాత్ లాగేసుకున్నట్లు అని వ్యాఖ్యానిం చారు. గుజరాత్ సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తు న్నట్లు వెల్లడిరచింది. రెండు వారాల్లోగా మళ్లీ నిందితులం దరూ జైలులో హాజరవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. హత్యా దోషులు సంవత్సరాల తరబడి జైలులో మగ్గుతున ప్పుడు 11 మంది వ్యక్తులకు ముందస్తు ఉపశమనాన్ని మంజూరు చేస్తున్నప్పుడు రాష్ట్రం ఏకరీతి ప్రమాణాలను అనుసరించిందా అనే దానిపై వాదనలు ప్రధానంగా దృష్టి సారించాయి. బానో తరపు న్యాయవాది, న్యాయవాది శోభా గుప్తా… దోషులు తమ నేరాల హేయమైన స్వభావానికి ఉపశమనానికి అర్హులు కాదని వాదనలు వినిపించారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వ అధికార పరిధిని కూడా సవాలు చేశారు. మహారాష్ట్రలో విచారణ జరిగిందని వాదిస్తూ, ఉపశమన సమస్యపై నిర్ణయం తీసుకునే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంటూ సెక్షన్ 432(7)(బి)ని ప్రస్తావించారు. ఇతర పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఎ.ఎం. సింఫ్వీు, బృందా గ్రోవం వాదనలు వినిపిస్తూ, ముంబైలోని ట్రయల్ జడ్జి, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇద్దరూ దోషులను విడుదల చేసే ప్రతిపాదనతో విభేదించారని, అయితే ముందస్తు విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిం దని అన్నారు. దోషులు రూ.34,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని లేదా 34 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయవాది బృందా గ్రోవర్ తెలిపారు. అయితే ‘జరిమానా చెల్లించలేదు. ఆ శిక్ష ఎప్పుడూ అమలు కాలేదు’ అని వాదించారు. దోషుల్లో ఒకరైన న్యాయవాది రిషి మల్హోత్రా వాదిస్తూ, మే 2022లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా గుజరాత్ ముందస్తు విడుదలకు సంబం ధించిన పిటిషన్ను నిర్ణయించిందని వాదించారు. అయితే, మే 13, 2022 నాటి ఉత్తర్వును సమీక్షించాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం ఎందుకు ఎలాంటి దరఖాస్తును దాఖలు చేయలేదని న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది సరైన ప్రభుత్వం కానందున నియమాన్ని ఉల్లంఘించినం దుకు సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉపయోగించిందని పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని న్యాయస్థానం పేర్కొంది.
‘మే 13, 2022 నాటి ఈ కోర్టు ఉత్తర్వును సద్విని యోగం చేసుకుని, ఇతర దోషులు కూడా ఉపశమన దరఖాస్తులను దాఖలు చేశారు. గుజరాత్ ప్రభుత్వం ఉపశమన ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ ఈ కేసులో ప్రతివాది నం.3 (దోషి రాధేశ్యామ్ షా) తో కలిసి పనిచేసింది. ఇది వాస్తవాలను అణచివేయడం ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించారు’ అని వ్యాఖ్యానించింది. ఈ ఉత్తర్వును పొందడం ద్వారా దోషులలో ఒకరి ఉపశమనం అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభు త్వాన్ని కోరుతూ మరో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ‘దోషులు తమ నేరారోపణల పర్యవసానాలను తప్పించుకోగలిగితే, సమాజంలో శాంతి, ప్రశాంతత చిమ్మచీకటికి దిగజారి పోతుంది. ఏకపక్ష ఆదేశాలను వీలైనంత త్వరగా సరిదిద్దడం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం ఈ కోర్టు విధి’ అని తెలిపింది. ‘గుజరాత్ రాష్ట్రం అధికార దుర్వినియో గానికి ఉదాహరణ. ఉపశమనాన్ని మంజూరు చేయడం ద్వారా చట్ట నియమాన్ని ఉల్లంఘించడానికి ఈ కోర్టు ఉత్తర్వు ఉపయోగించబడిన ఒక ముఖ్యమైన కేసు’ అని ధర్మాసనం పేర్కొంది. న్యాయవ్యవస్థను ఉల్లంఘిస్తే సమా నత్వ హక్కును కాలరాయడమేనని వ్యాఖ్యానించింది. ‘రూల్ ఆఫ్ లా అంటే చట్టానికి ఎవరూ అతీతులు కాదు. సమాన త్వం లేకపోతే చట్టబద్ధమైన పాలన ఉండదు. చట్టబద్ధమైన పాలనను అమలు చేయడానికి న్యాయస్థానం అడుగు పెట్టాలి. ఈ న్యాయస్థానం ఒక మార్గదర్శిగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలనను పరిరక్షించవలసి ఉంటుంది. ‘కరుణ, సానుభూతికి ఎటువంటి పాత్ర లేదు. హైకోర్టులు, సుప్రీం కోర్టు వంటి స్వతంత్ర సంస్థలకు న్యాయపరమైన సమీక్ష అధికారం ద్వారా న్యాయ పాలనను పరిరక్షించవచ్చు. పర్యవసానాల అలలను పట్టించుకోకుండా చట్టబద్ధమైన పాలనను కాపాడుకోవాలి’ అని తెలిపింది. వారు దోషులుగా నిర్ధారించబడి జైలు పాలైన తర్వాత వారి స్వేచ్ఛ హక్కును కోల్పోయారని, అలాగే, వారు మళ్లీ ఉపశమనం పొందాలనుకుంటే, వారు జైలులో ఉండటం ముఖ్యమని తెలిపింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అత్యాచారానికి గురైంది. ఆ సమయంలోనే ఆమె కుటుంబాన్ని కూడా కోల్పోయింది. ఆ కేసులో శిక్ష పడ్డ 11 మంది నిందితులను 2022లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముందస్తుగా విడుదల చేశారు. క్షమాభిక్ష ద్వారా విడుదలైన వారిలో జవ్వంత్ నాయి, గోవింద్ నాయి, శైలేశ్ భట్, రాథేశ్యామ్ షా, బిపిన్ చంద్ర జోషి, కేశరిభాయ్ వోహనియా, ప్రదీప్ మోర్దియా, బాకాభాయ్ వోహనియా, రాజుభాయ్ సోని, మిటేశ్ భట్, రమేశ్ చందన ఉన్నారు. జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలైనట్లు గుజరాత్ హోం శాఖ కార్యదర్శి రాజ్ కుమార్ గతంలో తెలిపారు. అయితే విడుదల తర్వాత ఆ 11 మందికి ఘన స్వాగతం పలికారు. కానీ ఖైదీల విడుదలను సవాలు చేసూత బిల్కిస్ బానోతో పాటు మరికొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు.