Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

కాపు, బలిజ సంక్షేమ సేన జిల్లా రైతు విభాగం అధ్యక్షుడుగా మీసాల నాగేశ్వరరావు

విశాలాంధ్ర-అనంద పురం : కాపు బలిజ సంక్షేమ సేన విశాఖ జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా మండల కేంద్రమైన ఆనందపురం గ్రామానికి చెందిన మీసాల నాగేశ్వరరావును నియమిస్తూ కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య నియామక పత్రం జారీ చేశారు. కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం మేరకు మీసాల నాగేశ్వరరావును విశాఖ జిల్లా కాపు బలిజ సంక్షేమ శాఖ రైతు విభాగం అధ్యక్షులుగా నియమించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో కాపు బలిజ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనకి ఈ బాధ్యతల అప్పగించిన కాపు బలిజ సంక్షేమ సేనవ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య కు ఎగ్జిక్యూటివ్ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img