. చేతులు మారిన రూ.20 వేల కోట్లు?
. బెట్టింగ్ సొమ్ముతో మధ్యవర్తుల ఉడాయింపు
. అప్పుల ఊబిలో బెట్టింగ్రాయుళ్లు
. జాక్పాట్ కొట్టినా… చేతికందని సొమ్ము
. ఒక్కొక్కటీగా వెలుగులోకి..
అయ్యయ్యో… చేతిలొ డబ్బులు పోయెనే… అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే… ఉన్నదికాస్త ఊడిరది… సర్వమంగళం పాడిరది… పెళ్లాం మెడలో నగలు తిరుక్షవరమైపోయింది… అని సినీ గేయ రచయిత అచ్చుగుద్ది చెప్పినట్టు ఉంది ఏపీలో బెట్టింగ్బాబుల తీరు. లక్షకు ఐదు లక్షలు… లక్షకు రెండు లక్షలు… కాయ్రాజా కాయ్… వైసీపీదే ప్రభుత్వం, కాదు… టీడీపీదే… అంటూ ఐపీఎల్ను మించి ఏపీలో ఎన్నికల ఫలితాలపై పందెంరాయుళ్లు రెచ్చిపోయి బెట్టింగ్లు కట్టడంతో ‘కోట్ల’ కట్టలు చేతులు మారాయి. ఓటమిపాలైన బెట్టింగ్రాయుళ్ల సంగతేమోగానీ, గెలిచినా సొమ్ము చేతికందక కొందరు లబోదిబోమంటున్నారు. అభ్యర్థులను పక్కనబెడితే… బెట్టింగ్రాయుళ్లు కొందరికి ఎన్నికలు శాపంగా మారాయి. జీవితాలను నాశనం చేశాయి. రూ. కోట్లలో ఆస్తులు కోల్పోయారు. మధ్యవర్తులు కొందరు బెట్టింగ్రాయుళ్ల అవతారమెత్తి సర్వం కోల్పోయి ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని డబ్బుతో ఉడాయించారు. బెట్టింగ్లో జాక్పాట్ కొట్టినా… నోట్ల కట్టలు చేతికందక ఆందోళనకు గురవుతున్నారు. బెట్టింగ్ సునామీ రాష్ట్రం, దేశం ఎల్లలుదాటిందంటే ఎన్నివేల కోట్ల రూపాయలు చేతులుమారాయో ఇట్టే అర్థమవుతోంది. ఒకప్పుడు క్రికెట్కే పరిమితమైన బెట్టింగ్లు… ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడంతో కుటుంబాలు రోడ్డునపడ్డ సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.