అంకారా : దేశాల మధ్య సంబంధాలు, ప్రాంతీయ సమస్యల మెరుగు దలకు టర్కీ
యూఏఈ దేశాల నాయకులు ఫోన్లో చర్చలు జరిపారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పాలకుడు ప్రిన్స్ మొహమ్మద్ బిన్జాయెద్తో ప్రాంతీయ ప్రత్యర్థుల మధ్య సంబంధాల మెరుగుదలకు అభిప్రాయల మార్పిడి చేసుకున్నాయని ఎర్డోగాన్ కార్యాలయం వెల్లడిరచింది. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు ప్రాతిపదికగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంబంధాలను బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు. ప్రధానంగా ఆర్థిక సహకారంపై దృష్టి సారించిన చర్చలు టర్కీలో యూఏఈ గణనీయమైన పెట్టుబడులకు దారితీస్తాయని అధికారులు తెలిపారు. లిబియాలో వివాదం, అంతర్గత గల్ప్ వివాదాలు, తూర్పు మధ్యదరా జలాలకు సంబంధించి అరబ్ దేశాలలో ఉద్రిక్తతల తగ్గింపు దిశగా చర్చలు చోటుచేసుకున్నాయి.