. భార్యను కాపురానికి పంపడం లేదని కక్ష..
. వెంటాడి కత్తితో దాడి…తప్పించుకున్న మామ
విశాలాంధ్ర – విజయవాడ క్రైం : భార్యను కాపురానికి పంపడం లేదని కక్షతో అత్తను అతీ కిరతకంగా నడిరోడ్డు పై నరికి చంపాడు అల్లుడు. ఈఘటన శనివారం రాత్రి విజయవాడ చనమోలు వెంకటరావు ప్లేవోవర్ పాలఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే జక్కంపూడి వైఎస్సాఆర్ కాలనీకి చెందిన గోగుల నాగమణి(50) తన కుమార్తె లలితను ఎకలవ్యనగర్కు చెందిన కుంభ రాజేష్కు ఇచ్చి వివాహం చేసింది. కొంత కాలంగా ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో నాగమణి పుట్టింటిలో ఉంటుంది. భార్యను కాపురానికి పంపించడంలేదని కోపం పెంచుకున్న అల్లుడు ప్రణాళిక ప్రకారం అత్తను అంతం చేశాడు. రాత్రి చనమోలు వెంకటరావు ప్లేవోవర్ మీదుగా నాగమణి అతని భర్తతో బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో వెనుక నుండి వచ్చిన అల్లుడు కొబ్బరికాయ కొట్టే కత్తితో మెడ పై దాడి చేశాడు. అక్కడిక్కడే నాగమణి కూప్పకూలింది.మావ తప్పించుకున్నారు. హత్య చేసిన రాజేష్ అక్కడి నుండి పరారైయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ సుబ్రమణ్యం తన సిబ్బందితో ఘటన స్ధలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుని కుటుంబ సభ్యుల నుండి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.