విశాలాంధ్ర – ఆదోని : జనసేన క్రియాశీలక సభ్యులందరికీ జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని జనసేన ఆదోని మండల, పట్టణ అధ్యక్షులు యం.తాహేర్ వలి , మలిశెట్టి రేణువర్మ అన్నారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీల సభ్యులకి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెట్టేకల్లు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వడ్ల సత్యనారాయణ తన వృత్తి ఆధారంగా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25,048 చెక్కు రూపంలో అందించడం జరిగింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఆదోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గారికి పంపించడం జరిగిందని తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది ఎలాంటి సంఘటన జరిగిన పార్టీ నాయకత్వాన్ని, కార్యాలయాన్ని సంప్రదించి విషయం తెలియజేస్తే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తే వైద్య ఖర్చుల కోసం ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు స్పందిస్తూ కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్, మండల నాయకులు పులిరాజు, లోకేష్, ప్రకాష్, జయరాం, చిరుత రాజశేఖర్, ఉరుకుందు, వెంకటేష్, గోపాల్, మల్లికార్జున, భాష తదితరులు పాల్గొన్నారు.