– జిల్లా కన్వీనర్ సుభాష్ చంద్రబోస్ మాదిగ
విశాలాంధ్ర – ఆస్పరి : త్వరలో జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ ఈనెల15వ తేదీన ఆదోని పట్టణంలో నిర్వహించే సన్నాహక సభకు వస్తున్నారని ప్రతి మాదిగ బిడ్డ సభలో పాల్గొని జయవంతం చేయాలని ఎం ఎస్ పి జిల్లా కన్వీనర్ సుభాష్ చంద్రబోస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సంజప్ప మాదిగ లు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ముఖ్యనాయకుల సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కన్వీనర్ సంజన్న మాదిగ, ఎంఎస్పి మండల కన్వీనర్ రామాంజనేయులు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ పిలుపుమేరకు ఎస్సి వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ త్వరలో లక్షలాదిమందితో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని 9 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్న భారతీయ జనతా పార్టీ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. మాదిగలకు ఆత్మ గౌరవం తెచ్చిన దండోరా పుట్టిన రోజును మరియు గౌరవ మంద కృష్ణ మాదిగ పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి ప్రతి మాదిగ బిడ్డ ఈనెల 7వ తేదీన అలాగే ఎమ్మార్పీఎస్ 29 వ ఆవిర్భావ దినోత్సవన్ని గ్రామ గ్రామాన వాడవాడలో జెండా ఎగరవేసి విజయవంతం చేయాలని, మరియు జులై 15న ఆదోనిలో జరిగే సన్నాహక సభలో మాదిగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆదోనిలో నిర్వహించే సన్నహాక సభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ పెద్దలు బోజప్ప, పెద్దయ్య, మారెప్ప, జైపాల్, తాయన్న, మహానంది, సుంకన్న, రంగస్వామి, అడివప్ప, ఈరన్న, నాగేంద్ర, రాముడు, మల్లికార్జున, పరుశురాముడు, అంజి లు పాల్గొన్నారు.