విశాలాంధ్ర- పెద్దకడబూరు : పెద్దకడబూరు మండల పరిషత్ వైస్ ఎంపీపీ – 1 గా చిన్నతుంబలం ఎంపీటీసీ ముత్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అశ్వథ్దామ వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. ముత్తమ్మకు మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలపడంతో వైస్ ఎంపీపీగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. వైస్ ఎంపీపీగా ఎన్నికైన ముత్తమ్మను వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ శ్రీ విద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసరావు, మాజీ ఎంపిపి రఘురామ్, కో ఆప్షన్ సభ్యులు షేర్ ఖాన్ పటేల్, నాయకులు గజేంద్రరెడ్డి, పూజారి ఈరన్న, జాము మూకన్న, గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కె యల్లప్ప, ఆయా గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.