Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 23, 2024
Monday, September 23, 2024

రైతులకు ఆన్లైన్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతుల ఆన్లైన్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఘోరంగా విఫలం చెందారని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రాజు, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ విమర్శించారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో మీ కోసం కార్యక్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో తాహశీల్దార్ శ్రీనాథ్ ను వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో చాలా చోట్ల భూ రీసర్వే తప్పుల తడకగా మారిందన్నారు. భూమి రిజిస్ట్రేషన్ అయినా కూడా ఆన్లైన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్ కు ఎన్నిమార్లు వినతిపత్రం ద్వారా విన్నవించినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు గానీ రైతుల సమస్యలు పరిష్కారించకుండా పెండింగ్ లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పాత పద్ధతిలోనే మోటివేషన్ ద్వారా ఆన్లైన్ సౌకర్యం కల్పించాలన్నారు. రైతులు ఇచ్చిన అర్జీలపై తహసీల్దార్ వెంటనే స్పందించి ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, రెక్కల గిడ్డయ్య, గోపాల్, నాగేష్, అర్జున్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img