విశాలాంధ్ర – ఆస్పరి : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నెల రోజులు పాటు కొనసాగిస్తున్న జగనన్న సురక్షతో సత్వర సేవలు అందుతాయని ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త సుంకర రామాంజనేయులు, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, తాసిల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో రాణేమ్మ,లు తెలిపారు. శనివారం మండల పరిధిలోనే కారుమంచి, బనవనూరు గ్రామ సచివాలయ కేంద్రాలలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచులు పెద్దిరెడ్డి, లక్ష్మీ, వైస్ ఎంపీపీ చంద్రకళ ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష పేదలకు వరం లాంటిదని, ఈ కార్యక్రమం ద్వారా 11రకాల దృవీకరణ పత్రాలను సర్వీస్ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా పొందే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి నరసింహారెడ్డి, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జేసిఎస్ మండల కన్వీనర్ బసవరాజు, సొసైటీ సీఈఓ అశోక్, వైకాపా నాయకులు కౌలిట్లయ్య, తిమ్మప్ప, ప్రకాష్, రాజన్న గౌడ్, పెద్ది రెడ్డి, ఆంజినయ్య, బాలయ్య శెట్టి, హాసన్, చంద్ర, కుక్కల రంగన్న వీరభద్ర ,మల్లేష్ గోవిందరాజులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటరీలు పాల్గొన్నారు.