నరవ రమాకాంతరెడ్డిని పూలమాలలతో సన్మానం చేస్తున్న సొసైటీ సిబ్బంది
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డిని శుక్రవారం సొసైటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. సొసైటీ కార్యదర్శి మురళీధర్ రెడ్డి, సహాయకుడు నారాయణ, సిబ్బందితో వెళ్లి నరవ రమాకాంతరెడ్డిని శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ రామస్వామి, సిబ్బంది వీరేష్ తదితరులు పాల్గొన్నారు.