విశాలాంధ్ర. నందికొట్కూరు : ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశ పెట్టడం జరిగిందని గ్రామ సర్పంచ్ జనార్దన్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శాతనకోట గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఎంపీడీవో శోభారాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాసిల్దార్ రాజశేఖర్ బాబు, హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా ప్రతి గ్రామంలో కొనసాగుతుందని ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ సేవలు, పథకాలు అందలేదని అనకూడదు అన్నట్టుగా ప్రతి సచివాలయ పరిధిలో ప్రజల ఇంటి వద్దకే గ్రామ వాలంటీర్లు వచ్చి ప్రజలకు తెలియపరచి 11 రకాల ధ్రువీకరణ పత్రాలు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ వేణు మాధురి, వెలుగు ఏపిఎం మధు, విద్యుత్ ఏఈ రాములు నాయక్, ఉపాధి హామీ ఏపిఎం అలివేలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, రవీంద్రబాబు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.