ప్రధానికి రాపోలు ఆనంద్ లేఖ
కులాల వారీగా జన గణన చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లేఖ రాశారు.దేశవ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రంలో ఉన్న డిమాండు మేరకు కులాల వారీగా జనగణన చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. మోదీ ఆధ్వర్యంలో అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆయన ఈ కులాల ఆధారిత జనగణన కూడా మోడీ నేతృత్వంలో జరగాలన్నారు. వచ్చేనెల 17న మోదీ జన్మదినం సందర్భంగా కులాల ఆధారిత జనగణనకి శ్రీకారం చుట్టాలని కోరారు. కులాల వారీగా జనగణన వల్ల సామాజిక న్యాయం, కేంద్ర పథకాలు పారదర్శకంగా వెనకబడిన తరగతులకి అందే అవకాశం ఉంటుందని రాపోలు అభిప్రాయపడ్డారు.