అన్నా హజారే డిమాండ్
కరోనా నియంత్రణలో భాగంగా మూసివేసిన ఆలయాలన్నింటినీ పది రోజుల్లోగా తెరవాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. లేదంటే తాను జైల్ భరో చేపడతామని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అహ్మద్నగర్ జిల్లాకు చెందిన మందిర్ బచావ్ కృతి సమితి బృందం రాళేగణ్సిద్ధి గ్రామంలో అన్నా హాజారేతో భేటీ అయి ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికను పరిశీలించిన హజారే, ఆలయాలను తెరవాలన్నారు. మందిరాలకు వచ్చే భక్తులు కోవిడ్ నియమాలు కచ్చితంగా పాటిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఆలయాలను తెరిచేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ ఆంక్షల వల్ల గత ఏడాదిన్నర నుంచి ప్రార్థనా మందిరాలన్నీ మూసే ఉంటున్నాయి.ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నియమాలను దశలవారీగా సడలిస్తున్నారు.