సూపర్వైజర్ సునీత
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమ ని,తల్లి పాలు బిడ్డకు శ్రీరామ రక్ష అని అంగన్వాడీ సూపర్వైజర్ కె.సునీత తెలియజేసారు.తల్లిపాల వారోత్సవాలు ఈనెల 1 వతేది నుండి 7 వతేది వరకు జరుగు తున్న సందర్భంగా కందుకూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వలేటివారిపాలెం సెక్టార్ లోని కొండసముద్రం అంగన్వాడీ కేంద్రంలో సీఢీపీఓ శర్మిష్ట చూచనమేరకు శనివారం గర్భవతులకు,బాలింతల కు,తల్లులకు అంగన్వాడీ సూపర్వైజర్ సునీత తల్లిపాల గురించి వివరించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులకు, బాలింతలకు,తల్లులకు తల్లి కాన్పు అయిన వెంటనే బిడ్డకు ముర్రు పాలు తాగించాలని ,తల్లిపాలు మొదటిగా సేవించె పాలుతాగిం చటంవలన బిడ్డకు కమ్యూనిటీ పెరుగుతుందని,తల్లి పాలు బిడ్డకు సరిపడినన్ని పోషకాలు వుంటాయని,తల్లిపాల వలన బిడ్డకు ఎటువంటి వ్యాధులు త్వరగా రావని వివరించారు. డబ్బా పాలవలన కలుగు నష్టా లు గురించి తెలియజేసారు. త ల్లి బిడ్డకు పాలు ఇచ్చుట వలన
ప్రేమానురాగాలు వుంటాయని గర్భవతులకు,బాలింతలకు వివరించారు.ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి,అంగన్వాడీ కార్యకర్తలు నాగేంద్ర,శిరోమణి,శిరీష,ఉషారాణి,కళ్యాణి,తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు