విశాలాంధ్ర – సీతానగరం : రహదారిభద్రతా నియమాలని పాటించి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని ఎంవిఐ ఎం. శశికుమార్, ఎఎంవిఐలు జి.సత్యనారాయణ, ఎన్. రమేష్ కుమార్లు కోరారు.సోమవారం సాయంత్రం స్తానిక హనుమాన్ కూడలి ఎదుట అటో డ్రైవర్లు, ద్విచక్ర వాహన యజమానులు, ప్రజలతో రోడ్డు భద్రత నియమాలు గూర్చి అవగాహణ కల్పించారు.
రాష్ట్ర రవాణా శాఖ కమీషనరుఆదేశాలతో పాటు జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జిల్లా రవాణాశాఖాధికారి సి.మళ్ళిఖార్జునరెడ్డి తఆదేశాలు మేరకు భద్రతా మాసోత్సవా లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వలన కలిగే ప్రమాదాల గూర్చి వివరించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహన దారులకు మరియు సీట్ బెల్ట్ ధరించిన వాహనాలను నడిపిన ఫోర్ వీలర్ వెహికల్ యజమానులను అభినందించారు. హెల్మెట్ & సీట్ బెల్ట్ ధరించని మరియు ఓవర్ లోడ్ పాసెంజర్స్ తో ప్రయాణించిన ఆటో డ్రైవర్స్ & ప్రయాణికులకు వాటివలన కలిగే రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు.పాదచారులు కూడా రోడ్డు దాటేటప్పుడు
తీసుకొనవలసిన జాగ్రత్తలను వివరించారు.వాహనాలు నడిపే వారు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, రోడ్డు భద్రత నియమాలు పాటించడం వలన ప్రమాదాలు నివారణకు అవకాశముంటుందని తెలిపారు.సురక్షిత ప్రయాణం గూర్చి, తక్కువ స్పీడ్ తో వెళ్లేలా వాహన యజమానులు ఆలోచన చేయాలనీ విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని వారందరి చేత ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం రవాణా శాఖ కానిస్టేబుల్ వి. శ్రీనివాసరావు, రవాణాశాఖ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహన యజమానులు,స్థానికులు,తదితరులు పాల్గొన్నారు.