Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఎన్నికల పరిశీలకులను కలిసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పిలు

విశాలాంధ్ర,పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల కమిషన్ నియమించిన సాధారణ , శాంతిభద్రతల పరిరక్షణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ, నయీం ముస్తఫా మన్సూరి లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకలెక్టర్, జిల్లాఎస్పీ ఎన్నికల పరిశీలకులకు పుష్పగుచ్చాన్ని అందించి సాదర స్వాగతం పలికారు.
ఈసందర్భంగా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహణకు అమలు చేస్తున్న ప్రణాళిక, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు, పటిష్ట నిఘా తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీలు వివరించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఖచ్చితమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుతోపాటు , పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img