విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం జిల్లా లోని సాలూరు నియోజకవర్గ సమీక్షా సమావేశంకు పార్వతీపురం విచ్చేసిన జిల్లా ఇంఛార్జి మంత్రి గుడివాడ అమరనాధ్ కు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,సాలూరు శాసనసభ్యులు పీడిక రాజన్న దొరకు, ఉమ్మడి జిల్లా జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు, మన్యం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజులకు ఎమ్మెల్యే జోగారావు పుష్ప గుచ్చంలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్వతీపురం నియోజక వర్గం ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.