విశాలాంధ్ర -వలేటివారిపాలెం : రాష్ట్ర ప్రయోజనాలకోసమే జగనన్న సురక్ష అని ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పిటీసీ ఇంటూరి భారతి పిలుపు నిచ్చారు .ముఖ్యంగా పార్టీ శ్రేణులు,అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆమేరకు శక్తివంచన లేకుండా శ్రమించాలని అన్నారు. శనివారం విశాలాంధ్ర విలేకరితో జెడ్పిటీసీ ఇంటూరి భారతి మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని,సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అందించగలుగుతున్నామని, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలని మరింత చైతన్యవంతులను చేస్తామని అన్నారు. గతంలో ఏ పని కావాలన్నా మండల, జిల్లా స్థాయిలోని కార్యాలయాలకు పరుగులు తీయాల్చి వచ్చేదని ఇప్పుడు సచివాలయాలవ్యవస్థ పుణ్యమా అని ఆ అవసరమే లేకుండా మన జగనన్న ప్రభుత్వం ఇంటివద్దకే పాలన తెచ్చిందన్నారు. పరిపాలన సంస్కరణల్లో బాగంగా ఒక కుటుంబానికి 11అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఁజగనన్న సురక్ష ఁ కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని ఈ కార్యక్రమం విజవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 11అంశాలలో కీలకమైనది రేషన్ కార్డుల విభజనఅని,ఆయా కారణాలతో ఇంతవరకు రేషన్ కార్డులు పొందలేనివారు ఇకపై రేషన్ కార్డులు సునాయాసంగా పొందగలరని అన్నారు.