Monday, May 6, 2024
Monday, May 6, 2024

98వ ఉచిత వైద్య చికిత్స శిబిరం.. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవాలయంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ప్రముఖ డాక్టర్లచే 98వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి సంఘం నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తామని, వృద్ధులకు, పేద ప్రజలకు వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు మామిళ్ళ రంగప్ప జ్ఞాపకార్థం ధర్మపత్ని మామిళ్ళ నారాయణమ్మ, కుమారుడు మాధవి మామిళ్ళ తులసి ప్రసాద్ అండ్ సన్స్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరానికి ప్రముఖ డాక్టర్లు వివేకుల్ల యప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్, డివి. జైదీపు నేత హాజరవుతారని తెలిపారు. బిపి తోపాటు షుగర్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. కావున గ్రామీణ, పట్టణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img