విశాలాంధ్ర ధర్మవరం:ధర్మవరం పట్టణంలో గణపతి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి మున్సిపల్ అధికారులతో మాట్లాడి, రెండు పెద్ద క్రేన్లను ఏర్పాటు చేయించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళు, వీధుల్లో పోలీసుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని ఏర్పాట్లను చేయించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి.చెర్లోపల్లి నారాయణస్వామి, ఎస్పీ రత్న, వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, డిఎస్పి టి శ్రీనివాసులు, వైద్య నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.