విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని మరువపల్లి గ్రామానికి చెందిన వడ్డి ఆంజనేయులు ప్రమాదవశాత్తూ మిద్దె మీద నుండి పడి మరణించారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతిక కాయాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని రాగా అక్కడికి వెళ్లి భౌతిక కాయనికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమెతో పాటుగా మాధవ నాయుడు సర్పంచ్ శ్రీనివాసులు, త్రివేంద్ర నాయుడు ,మరువపల్లి రాము, సూరి, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.