ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్
విశాలాంధ్ర ధర్మవరం:: యునైటెడ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన చెన్నైలో జరుగుతున్న ర్యాలీని జయప్రదం చేయాలని ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవ్ ఎడ్యుకేషన్ రిజెక్ట్ ఇండియా రిజెక్ట్ బిజెపి అనే నినాదంతో చెన్నై నగరంలో జరగబోతున్న ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాలీకి సంబంధించిన వాల్పోస్టర్లను వారు విడుదల చేశారు. పేద విద్యార్థులకు విద్యను అందరి ద్రాక్షలా మిగిల్చడానికి ఎన్ ఈ పిని విద్యా కాషాయ కర్ణ చేస్తున్నటువంటి బిజెపిను రిజెక్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఎన్ ఈ పి వలన పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందరిని ద్రాక్షల ఉందని తెలిపారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం వల్ల పేద విద్యార్థులకు చదువుకుంటూ పడేదే తప్ప ఏమీ ప్రయోజనం లేదని తెలిపారు. కాబట్టి ప్రత్యేక విద్యార్థి విద్యార్థులు యువకులు అందరూ కూడా చెన్నై నగరంలో జరుగుతున్న వంటి మహా ర్యాలీలో పాల్గొని విద్యార్థులకు హామీ తలపెడుతున్నటువంటి ఎన్ఈపిని దేశంలో తరిమివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి పట్టణ నాయకులు పురుషోత్తం, యాసీన్, మురళి, విజయ్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు విజయ్, శ్రీనివాసులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.