బాల వికాస్ జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ ఆదిలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం:: చిన్నారులకు భారతీయ సంస్కృతిని అలవాటు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ ఆదిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ లోని బాలవికాస్ సెంటర్లో చిన్నారులకు బాలవికాస్ తరగతులను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 22న జరగబోయే అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని బాల వికాస్ సెంటర్లో చిన్నారులకు శ్రీరామ జయరామ అనే నామ సంకీర్తనను చేయించడం జరిగిందన్నారు. అదేవిధంగా చిన్నారులకు మంచి అలవాట్లు, భారతీయ సంస్కృతి, దైవభక్తి, సమాజంలో క్రమశిక్షణతో మెలిగే పద్ధతులను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురువులు నీలవేణి, చౌడమ్మ పాల్గొన్నారు.