హెచ్ డి బి ఫైనాన్స్ సర్వీసెస్
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణములోని హెచ్డిపి ఫైనాన్స్ సర్వీసెస్ ధర్మవరం శాఖ వారు తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో గల అనాధ వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు, అనాధలకు బ్రెడ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అనాధాశ్రమమునకు బియ్యము, వంట సరుకులు,కూరగాయలను కూడా వారు పంపిణీ చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమం తాము చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు చంద్ర హెచ్డీబి ఫైనాన్స్ ఉద్యోగస్తులకు ఆశ్రమం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ప్రకాష్,అరుణ్, రాజు, పవన్ కుమార్ రెడ్డి, ఆనందు,చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు.