టిడిపి పట్టణ అధ్యక్షుడు పరీసే సుధాకర్
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని కేతిరెడ్డి కాలనీ ఎల్-4 కు చెందిన వెంకట రాముడు రెండు రోజుల క్రిందట మృతి చెందాడు. సమాచారం అందుకున్న టిడిపి పట్టణ అధ్యక్షుడు పరీసే సుధాకర్, 28వ వార్డు ఇంచార్జ్ గస్తీ ఓంకార్, మాధవరెడ్డి, మహిళా నాయకురాలు సుగుణమ్మ యశోదమ్మలు, పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు మృతిని భార్య శ్యామలమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించి, వారి భర్త మృతికి సంతాపం తెలుపుతూ, తమ వంతుగా 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇందులో భాగంగానే ఇల్లు తాకట్టులో ఉందని, బాధితులు తెలపగా, టిడిపి నాయకులు సొంత డబ్బును చెల్లించి, తద్వారా ఇంటి పత్రాలను కూడా విడిపించి ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం బాధితులు టిడిపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.