అందజేసిన కౌన్సిలర్ సరితాల ఆశాబి దంపతులు...
విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురం జిల్లాలోని గూగూడు మండలంలో గల గూగుడు కుల్లాయి స్వామి అన్నదాన సత్రం నిర్మాణానికి ధర్మవరం పట్టణం 28వ వార్డు కౌన్సిలర్ సరితాల ఆశాబి, భర్త చరితల భాష దంపతులు ఆదివారం రోజున దంపతులు గూగూడు కుళాయి స్వామిని దర్శించుకుని, అనంతరం తమవంతుగా ఒక లక్ష 25 వేల రూపాయల విరాళమును ఆలయ ధర్మకర్తకు వారు అందజేశారు. తదుపరి ఆలయ ధర్మకర్తలు దంపతుల పేరిటన చదివింపులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.