శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు
విశాలాంద్ర ధర్మవరం:: అన్నదానం చేయడంలో ఎంతో సంతృప్తి కలదని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణము లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్టాఫ్ నర్సులచే 340 మందికి భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు కూడా పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, భర్త వెంకటస్వామి వారి సహాయ సహకారములతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న సేవలు మరువలేనివని ఇటువంటి కార్యక్రమాలు రోగులకు వరం లాగా మారడం అదృష్టమని తెలిపారు. అనంతరం నిర్వాహకులకు వైద్యుల, సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.