మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం; మున్సిపాలిటీకి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పన్నులో రూ.8,94,89,254 కు గాను 4,43,28,766 వసూలు కావడం జరిగిందని, ఇంకనూ 4,51,60,488 వసూలు కావలసి ఉందన్నారు. అదేవిధంగా నీటి పనుల్లో రూ.8,43,36,977 కు గాను 3,40,71,090 వసూలు కావడం జరిగిందని ఇంకను 5,02,65,887 వసూలు కావాల్సి ఉందన్నారు. తదుపరి ఖాళీ జాగా పన్నుల్లో రూ.65,70,653 కు గాను 18,42,509 వసూలు అయిందని, ఇంకనూ 47,28,144 రూపాయలు వసూలు కావలసి ఉందన్నారు. కావున పట్టణ ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా మొండి బకాయిలు కూడా మార్చి 31వ తేదీ లోపల చెల్లించాలని తెలిపారు.