.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ముగ్గుల పోటీల్లో 120 మంది పాల్గొన్నారని, అందులో మొదటి బహుమతి పావని గ్రూపు, రెండవ బహుమతి సాయి కీర్తి గ్రూపు, మూడవ బహుమతి గ్రీష్మ గ్రూపు, నాలుగవ బహుమతి సాయి లిఖిత గ్రూపు, ఐదవ బహుమతి నవ్యశ్రీ గ్రూపు వారు విజేతలుగా ఉన్నారని కర్రీస్పాండెంట్ డోల పెద్దారెడ్డి తెలిపారు. విజేతలందరికీ కళాశాల అధ్యాపకులు కరస్పాండెంట్ తోటి విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.