కౌన్సిలర్ మేడాపురం వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పార్థసారధి నగర్-2 లో నివాసముంటున్న కే పోతులయ్య (39 సంవత్సరాలు) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కోల్కే లేక బుధవారం మధ్యాహ్నం మృతి చెందడం జరిగింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు చనిపోయిన వ్యక్తికి వైయస్సార్ బీమా లో భాగంగా సాధారణ భీమా తక్షణ సహాయం కింద పదివేల రూపాయలను భార్య భాగ్యలక్ష్మి కి వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శి సాయి ప్రకాష్, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, గృహసారథులు, వాలంటీర్ పాల్గొన్నారు.