విశాలాంధ్ర, కూకట్పల్లి: మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కొరకు కృషి చేస్తూ, వారికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానాని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు కొరకు తనవంతు కృషి చేస్తానని కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. మంగళవారం బాలానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మున్నూరు కాపు సంఘం, తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర కార్యదర్శి తెల్ల హరికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆకుల బాలకృష్ణ, కూకట్ పల్లి నియోజకవర్గం అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ “బి బ్లాక్” అధ్యక్షులు తూము వేణులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీకి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందజేస్తానని సానుకూలంగా స్పందించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు, శేరే సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.