కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రిని కోరిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రపంచంలోనే అతి ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం పట్టు చీరల కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుండి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగును ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్య కుమార్ యాదవ్ కేంద్ర మందితో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో ధర్మవరంలో చేనేతలు తనపై ఎంతో నమ్మకంతో అండగా నిలిచి, గెలిపించడం జరిగిందని, వారి రుణం తీర్చుకోవడానికి ధర్మవరంలో మార్కెటింగ్ వ్యవస్థ, టెక్స్టైల్స్ పార్కు, మెగా క్లస్టర్ మంజూరు చేసి, పట్టు పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు సహకరించాలని వారు కోరడం జరిగిందని తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ ధర్మవరంలో చేనేత రంగం అభివృద్ధి కోసం తాను తప్పకుండా తన ద్వారా సహకరిస్తానని కేంద్ర ప్రభుత్వము నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా తాను త్వరలో ధర్మవరానికి విచ్చేస్తానని వారు హామీ ఇచ్చారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ కేంద్రమంత్రి కి ఫోన్లో కృతజ్ఞతలు తెలియజేశారు.