Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రైతాంగానికి రెండు లక్షలు రుణమాఫీ ఒకే దఫా చేయాలి

ఏ.పి. రైతు సంఘం డిమాండ్

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.07.02.2024ది. రైతాంగానికి ఒకే సారిగా రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేయాలని ఏ.పి.రాష్ట్ర రైతు సంఘం కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. చొడవరలోని మీడియాతో బుదవారం రెడ్డిపల్లి మాట్లాడుతూ ఆరుగాలం కుటుంబంతో కలసి కష్టించి పని చేసే అన్నదాతలు నిత్యం పెరిగిపోతున్న పెట్టుబడు లు పెట్టలేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతోందన్నారు.
పంటల సాగుకు నీరు లేక ఇబ్బందులు పడుతూ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు భారీగా పెరుగుతుండటంతో, తీసుకున్న అప్పులకు వడ్డీలు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
విత్తనాలు, ఎరువులు పురుగు మందులు ప్రభుత్వమే సబ్సిడీపై రైతులకు అందజేయాలని కోరారు. రైతుల పట్ల అధికార ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల జాలి, దయ, ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న సి.ఎం. జగన్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
సోమనాధ్ కమిషన్ నివేదికలు అమలు చేయాలని, కేరళ మాదిరిగా రైతులకు పంట రుణమాఫీ చేయాలని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సబ్సిడీ తో రైతులకు అందజేసినప్పుడే రైతులు అప్పుల్ల ఊబ్బి లోంచి బయటపడే అవకాశం ఉందని తెలియజేసారు.
ఏ.పి.రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద రైతులు మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడతామని, రైతాంగం పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం లో చప్పా శ్రీనివాసరావు, కుమ్మర సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img