విశాలాంధ్ర ధర్మవరం:: పొట్టి శ్రీరాములు సేవలు, ప్రాణత్యాగం మరో లేనివని ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు అంబటి అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 123వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవిత భావితరాలకు ఆదర్శమని, పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష కారణంగానే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిందని తెలిపారు. ప్రజల మేలు కోసం ప్రాణ త్యాగం చేసిన మహాత్ముడు కాబట్టి వారిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని కృతజ్ఞతతో జీవించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలవల రఘు, దేవతా శ్రీనివాస్, రేగంటి రెడ్డి వంశీరాం తదితరులు పాల్గొన్నారు.