Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఎన్నికల ప్రచారo చేస్తున్న వైఎస్సార్సీపీ

విశాలాంధ్ర. రాజాం : విజయనగరం పార్లమెంటు అభ్యర్ధి బెల్లాన.చంద్రశేఖర్ రాజాం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డా. తలే.రాజేష్ కి వెల్లువెత్తిన అభిమానాలు
అడుగడుగునా నీరాజనాలు పలికిన సంకిలి గ్రామ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.సంకిలి గ్రామంలో ప్రచారం చేస్తున్న పార్లమెంటు సభ్యులు బెల్లాన. చంద్రశేఖర్ , ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాలవలస.విక్రాంత్ బాబు , రాజాం నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి డా.తలే.రాజేష్ , నియోజకవర్గం పరిశీలకులు కె.వి.సూర్యనారాయణరాజు (పులి రాజు)కి బ్రహ్మరథం పడుతూ , గడప గడప కు హారతులు ఇస్తున్న మహిళ ఆడపడుచులు, మీరు అందరూ మా మధ్యకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు.ప్రతి గడపలోనూ జగనన్న ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఇంట్లోను పార్టీలకు అతీతంగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు పెన్షన్లు, అమ్మఒడి, విద్యాదీవెన, జగనన్న ఆసరా, నవరత్నాలు, వాలంటరీ ,సచివాలయం వ్యవస్థలను స్థాపించి ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పని చేస్తుందని, మే – 13th న జరగబోయే ఎన్నికలలో మేమందరం రాజాం నియోజకవర్గం నుంచి డా.తలే.రాజేష్ నీ ఎమ్మెల్యే గా, పార్లమెంటు సభ్యునిగా బెల్లాన.చంద్రశేఖర్ ని గెలిపించుకొని జగనన్నకి బహుమతిగా ఇస్తామని, రాజాం లో YSRCP పార్టీ జెండా మరల ఎగరవేస్తామని అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ టoకాల.అచ్చెన్నాయుడు , మండల పార్టీ అధ్యక్షులు వావిలపల్లి.జగన్ మోహన్ రావు , మండల యూత్ పార్టీ అధ్యక్షులు మజ్జి.శ్రీనివాసరావు ,JCS మండల కన్వీనర్ కింజరాపు.సురేష్ ,PACS అధ్యక్షులు వంజరాపు.అశోక్ కుమార్ , సంకిలి మాజీ సర్పంచ్ రాయపురెడ్డి.క్రిష్ణబాబు ,సర్పంచ్ బుడుమూరు. పట్టాభి మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img