విశాలాంధ్ర,సీతానగరం: మండలకేంద్రంలో శ్రీలక్ష్మినరసింహస్వామిఆలయంలో గురువారంనాడు ఓంనమో శ్రీలక్ష్మినరసింహస్వామి, ఓంనమోనారాయణాయ, ఓంనమో శ్రీవేణుగోపాలస్వామిఅంటూ ముడుపుల పూజలకు వేకువ జామునుండే భక్తులువివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా భక్తులు పోటెత్తి వచ్చారు.ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, కృష్ణామాచార్యులు, మురారీ తదితరులు కొత్తవారికి ముడుపులు కట్టి పూజలు చేయించారు.స్వామి వారిని రకరకాల పూలతో చేసిన అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది.ప్రతీగురువారం నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి నరసింహస్వామీ ముడుపులపూజలకు దూరప్రాంతాలనుండి వాహనాలతో పెద్ద ఎత్తున భక్తజనంవిచ్చేసి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలను చేసి స్వామివారిని దర్శించుకుని, గోవింద గోవింద, జైశ్రీలక్ష్మినరసింహ, ఓం నమో నారాయణాయ అంటూ 27సార్లు ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.పూజలయ్యాక తీర్దంతీసుకోవడానికి, ప్రసాదాలు తీసుకోవడానికి గంటల తరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఉదయంనుండి సాయంత్రం వరకు బ్యాచులవారీగా భక్తులు ముడుపులు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ లక్ష్మినరసింహస్వామీ పుణ్యమాఅని బొబ్బిలిరాజుల ఇష్టదైవం శ్రీవేణు గోపాలస్వామి దేవాలయంను అందరూ దర్శించుకునే భాగ్యం కూడా కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. ఇక్కడ ఉత్తరవైపు సువర్ణముఖినది ప్రవాహంవల్ల ఇక్కడ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు కోరుకున్న కోర్కెలు నెరవేరడం జరుగుతుందని అప్పట్లో చినజీయర్ స్వామి వారే చెప్పడం గమనార్హం. శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయంను నిర్మించినదాత కీర్తిశేషులు రాజశేఖర్ చేసిన మేలును మరువ లేనిదని భక్తులు తెలియజేయడం గమనార్హం.ఆయన నిర్మించి ప్రతిష్టచేసిన ఆలయాన్ని చెలికాని గోపాలకృష్ణ, భారతి దంపతులు ఆలయఅభివృధ్ధికి కృషి చేస్తున్నారు.ప్రతీగురువారం జరుగుతున్న పూజలకు వచ్చే భక్తజనంకు ఆలయ అర్చకులు చేస్తున్నసేవలు కూడా అభినందనీయం. చిన్నవయస్సులో ఉన్న అర్చకులు పెద్దతరహాలో అందరితో కలిసి మెలిసి ఉంటూ భక్తులకు అందజేస్తున్న ఆశీస్సులు పట్ల వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.