విశాలాంధ్ర, సీతానగరం : బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి తెర్లి హేమాక్షి ఆధ్వర్యంలో నిడగల్లుగ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరంను గురువారం నిర్వహించారు.గ్రామంలో పలువురుకి తనిఖీలునిర్వహించారు.జలుబు ,దగ్గు,
ఆయాసం, మలబద్ధకం ,వాతవ్యాధులు, జీర్ణసంబంధిత వ్యాధులుకు మందులు ఇవ్వడం జరిగిందన్నారు. నిడగల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, అక్కడ విధ్యార్థులకు తనిఖీలు నిర్వహించి సీజనల్ వ్యాధులుకి సంబంధించిన మందులు అందజేసారు.వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చుట్టూ పరిసరాలలో లభించే మొక్కలు, వాటి ఉపయోగాలు గురించి వివరించారు. యోగా గూర్చి అవగాహణ కల్పించారు.ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు,ఆయుర్వేద వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.