విశాలాంధ్ర- భోగాపురం: (విజయనగరం) మండలంలో భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి దివ్యాంగుల పాఠశాల విద్యా శాఖ తరపున ఉచిత శిక్షణ ఇస్తున్నారు. భవిత (ఐఈఆర్పీ) కేంద్రాలకు చెందిన రిసోర్స్ పర్సన్లు ఇంటింటికీ వెళ్లి దివ్యాంగుల సమగ్ర అవసరాలు గుర్తించి వారిని కేంద్రాలకు తరలిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు రమణమూర్తి, చంద్రమౌళి సూచనలు మేరకు మండలంలో క్రొత్త దివ్యాంగులను గుర్తించి, పాఠశాలలో నమోదు కార్యక్రమం చేపట్టామని ఐఈఆర్పీ డివి రమణ రాజు, తెలిపారు. మండలంలో అంగన్వాడీలుతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికీ పది మంది కొత్త దివ్యాంగులను నమోదు చేశామని తెలిపారు. వనం పేట-2, సవరవిల్లి -3, రావాడా -2 బోరపేట-1, నారు పేట-1, ముక్కాం -1 గుర్తించడం జరిగింది అని తెలిపారు. మండలంలో ముంజేరు, ముక్కాం, ఆర్ సి హెచ్ పేట క్లస్టర్ కు ఐఈఆర్పీ రవణమ్మ, పోలిపల్లి, రావాడ సవరవిల్లి మహారాజుపేట క్లస్టర్కు ఐఈఆర్పీ డి వి రమణ రాజు సర్వే చేస్తున్నారు.