విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు , నియోజకవర్గ ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సూచన మేరకు విజయనగరం మండలం క్లస్టర్ -1 లో జమ్ము నారాయణపురం గ్రామంలో గురువారం “జయహో బిసి” కార్యక్రమం బీసీ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైకాపా ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, వారిపై దాడులు వంటి విషయాలపై చర్చించి తెలుగుదేశం పార్టీ – జనసేన – బీజేపీ పార్టీలకు మద్దతుగా బిసిలందరూ నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారిని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో కంది మురళీనాయుడు, బొద్దుల నర్సింగరావు, గంటా పోలినాయుడు, కోండ్రు శ్రీను, వేచలపు శ్రీను, కంది సాయి జగ్గారావు, , మాడిమి దేవేంద్రనాధ్, బోను కుమార్, పేరిశెట్టి గోపి , బీసీ కులవృత్తులు మరియు బీసీ వర్గాల ప్రజలు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.