Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రౌతు బంగారునాయుడికి పతంజలి పురస్కారం

సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి
విశాలాంధ్ర విజయనగరం : ప్రముఖ రచయిత,వివిధ దినపత్రిక ల సంపాదకులు గా పనిచేసి తన రచనలతో అక్రమాల సమాజాన్ని ఎండగట్టిన స్వర్గీయ కె.ఎన్.వై. పతంజలి పేరున ప్రతియేటా అందచేసే రాష్ట్ర స్థాయి పతంజలి పురస్కారం ఈ ఏడాది విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన రచయిత రౌతు బంగారు నాయుడికి అందజేయనున్నామని
కె.ఎన్.వై. పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్ష,కార్యదర్సులు భీశెట్టి బాబ్జి,ఎన్. కె.బాబు ప్రకటించారు.
గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
.రౌతు బంగారు నాయుడు రచయితగానే కాకుండా
గడచిన ఇరవై ఏళ్ళ గా ఎలక్ట్రానిక్ మీడియా లో కంటెంట్ హెడ్ గా విధులు నిర్వహిస్తున్నారన్నారు.మే నెల 17 న విజయనగరం లో జరిగే కార్యక్రమంలో పురస్కారం ఆయనకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.రౌతు బంగారు నాయుడు పేరుని పురస్కార ఎంపిక కమిటీ ప్రతినిధులు సీనియర్ పాత్రికేయులు వి.ఎమ్.కె.లక్ష్మణరావు, భళ్లమూడి నాగేంద్ర ప్రసాద్,రచయిత ఎన్.కె.బాబు సూచించారని బాబ్జీ తెలిపారు.ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని మే 17 కి మార్చడం జరిగిందని తెలిపారు.,గడచిన పది సంవత్సరాలుగా పతంజలి పేరిట పురస్కారాలు అందచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, జలంత్రి రామచంద్ర రాజు,తాడేపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img