విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని వాడ వాడలా ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుదవారం ఉదయం యోగా కార్యక్రమాలని ఘనంగ నిర్వహించారు. నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఆవశ్యకతను వివరించారు. మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా యోగా పనిచేస్తుందని తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం ఇళ్లా ప్రసన్నలక్ష్మి ఆద్వర్యంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ బొబ్బిలి రేణుక, ఎన్ ఎస్ ఎస్ పిఓలు రవికుమార్, దాసరి రామకృష్ణ ఆద్వర్యంలో, కోటసీతారాంపురం పాఠశాలలో హెచ్ ఎం చుక్క శ్రీదేవి ఆద్వర్యంలో, ఆవాలవలస ప్రాధమిక పాఠశాలలో హెచ్ ఎం ఈదుబిల్లి శ్రీనివాసరావు ఆద్వర్యంలో, గెడ్డలుప్పి కూడలి వద్ద కృషి స్కూలులో కరస్పాండెంట్ డి. శ్రీనివాసరావు ఆద్వర్యంలో నిర్వహించారు. అన్ని పాఠశాలలో యోగా దినోత్సవాన్ని నిర్వహించినట్లు ఎంఈఓ సూరిదేముడు తెలిపారు. అన్నిసచివాలయాల్లోని, ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన కొనేర్ల వద్ద యోగా దినోత్సవాన్ని నిర్వహించినట్లు ఎంపిడిఓ ప్రసాద్, ఏపిఓ భాను తెలిపారు.