విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని సీతానగరంలోగల శ్రీలక్ష్మి నరసింహాస్వామి ఆలయంలో ప్రతీ గురువారం జరుగుతున్న ముడుపుల పూజలకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు.శ్రీలక్ష్మీనరసింహస్వామి
ఆలయంలో తెల్లవారుజామున నాలుగున్నరగంటల నుండి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు పూజలను నిర్వహిస్తారు. ప్రతీగురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామీ దేవాలయంలోజరుగుతున్న ముడుపుల పూజలకు అనూహ్య స్పందనతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలనుండి భక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో పూజలు చేస్తున్నారు. ఇక్కడ సువర్ణ ముఖీనదీతీరప్రాంతం కావడంతో భక్తులకు ఆహ్లాద కరమైన వాతావరణం ఉండటం గమనార్హం