బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం పసిడి ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా క్షీణించాయి. పసిడి ధరలు కొద్ది రోజుల క్రితం రూ.63,000 క్రాస్ చేశాయి. ఇప్పుడు రూ.58,000 స్థాయికి దిగి వచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.58,080 వద్ద ఉంది. ఢిల్లీ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర రూ.59,050కి, కిలో వెండి ధర రూ.350 క్షీణించి రూ.71,250కి పడిపోయింది. గత ట్రేడింగ్ సెషన్ లో పది గ్రాముల పసిడి ధర రూ.59,350 వద్ద ముగిసింది. హైదరాబాద్ లో పది 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.58,750, 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.53,850గా ఉంది.