ఏపీ మీదుగా మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. విశాఖ-భువనేశ్వర్ మధ్య నడవబోయే వందేభారత్ రైలును శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రామ్మోహన్ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో విశాఖ నుంచి భువనేశ్వర్కు వందేభారత్ రైలు ప్రారంభంకాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు కాశీకి ప్రత్యేక రైలు లేకపోకడంతో జిల్లా వాసులు పడుతున్న ఇబ్బందులను కూడా ఎంపీ వివరించారు. విశాఖ నుంచి నడుస్తున్న వారణాశి వీక్లీ రైలును రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ – పలాస మెమూ రైలుని ఇచ్ఛాపురం వరకు.. అలాగే భువనేశ్వర్-పలాస మధ్య నడిచే మెమూ రైలును శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ వరకు పొడిగించాలని కోరారు.
మే నెలలోనే విశాఖ-భువనేశ్వర్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. ఆ దిశగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలు వచ్చి అగడంతో.. ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారని చర్చించుకున్నారు. .