విశాలాంధ్ర( వత్సవాయి ) : రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమలగిరి గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ వాల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన కొమరగిరి భరద్వాజ్ నియమితులయ్యారు. శనివారం జగ్గయ్యపేట శాసనసభ్యులు, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి వచ్చిన నియామక ఉత్తర్వులను ఉదయభాను ఆలయ చైర్మన్ భరద్వాజ్ కు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా బాధ్యతలుఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతగా ఉంటానని దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. భక్తుల మనోభావాలకు అవరోధం కలగకుండా గౌరవభావంతో చూసుకుంటానని అన్నారు
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మాజీ చైర్మన్ పసుపులేటి సుబ్రహ్మణ్యం, విశ్వ భారతి శ్రీలక్ష్య కళాశాల డైరెక్టర్ కే పద్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు