కౌంట్డౌన్ ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ ఎఫ్14ను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించనుంది.
విశాలాంధ్ర -సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ ఎఫ్14ను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించనుంది. రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లబోతోంది. దీని ద్వారా ఇన్సాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.05గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది 27.30 గంటలు నిర్విరామంగా కొనసాగుతుంది. భూమికి 36,786 కీమీల ఎత్తులోని జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ఇన్సాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సాట్ 3డీఎస్ ఉపగ్రహం బరువు 2,275 కిలోలు కాగా దీనిని వాతావరణ అధ్యయనం, సముద్ర ఉపరితలాలపై పరిశోధన కోసం ప్రయోగించనున్నట్లు వెల్లడిరచారు.