Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఈసారి అధికారం ‘ఇండియా’దే

ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమి
బీజేపీని గద్దె దించాల్సిందే : వినయ్‌ విశ్వం

తిరువనంతపురం:
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాబోతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి, కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్‌ విశ్వం విశ్వాసం వ్యక్తంచేశారు. 2019లో వలే కాకుండా 2024లో ప్రతిపక్ష కూటమి గెలుపు తథ్యమన్నారు. ప్రతిపక్షాలు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నట్లు చెప్పారు. ఎన్డీయేకి సమర్థ ప్రత్యామ్నాయం ఇండియా కూటమి అని అన్నారు. ఎన్నికల వేళ విపక్షాల్లో ఐక్యత అత్యవసరమన్నారు. భారత రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతున్న బీజేపీ గద్దె దించడం అత్యవసరమని నొక్కిచెప్పారు. ఇండియా కూటమిలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ సమర్థంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్నారు. ‘2019లో బీజేపీకి సమర్థ ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రజల ప్రశ్నకు సమాధానం లభించలేదు కానీ ఇప్పుడు ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా ఉంది’ అని పీటీఐకిచ్చిన ఇంటర్య్వూలో రాజ్యసభ ఎంపీ వినయ్‌ విశ్వం చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వ గుట్టు పూర్తిగా రట్టు కానున్నట్లు తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల్లో, పౌరుల ఖాతాల్లో రూ.15లక్షల జమ, అన్ని గ్రామాల్లో ఫైబర్‌ కనెక్టివిటీ వంటివన్నీ ఏమయ్యాయని బీజేపీని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల సమాధిపై నుంచి కొత్త హామీలు గుప్పిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ మాటల్లో గొప్ప చేతల్లో కాదని ప్రజలు గ్రహించారన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌ ప్రతీక. ఇలాంటి దేశంలో భిన్న ఆలోచనలు సహజం. భిన్న ఆలోచనలు సమ్మిళితమై ఇండియా కూటమిగా రాణించగలం’ అని విశ్వం అన్నారు. కూటమిలో పటిష్ఠ, న్యాయమైన స్వరం అవసరమన్న దృష్ట్యా లెఫ్ట్‌పార్టీలు కలిసి వచ్చాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ ఎంపీలు పిల్లిమొగ్గలు వేసే అవకాశం లేకపోలేదన్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి, హంగ్‌ ప్రభుత్వం ఏర్పాటు కావచ్చన్నారు. కేరళ, వాయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీని పోటీ చేయించడం వ్యూహాత్మక తప్పిదమని కాంగ్రెస్‌ పార్టీని విమర్శించారు. కాంగ్రెస్‌కు నిజమైన ప్రత్యర్థి బీజేపీనా లేక లెఫ్ట్‌ పార్టీలా అన్నది తేల్చాలన్నారు. ‘దేశంలో ఎక్కడ నుంచైనా రాహుల్‌ పోటీ చేయొచ్చు కానీ వాయనాడ్‌ నుంచి పోటీ కోసం ఒత్తిడి చేస్తున్న నాయకులు… వారి పోరాటానికి ప్రధాన బరి ఏదో తేల్చాలి. పార్లమెంటుకు 200 మంది ఎంపీలను బీజేపీ నుంచి పంపించే ఉత్తర భారతమా లేక కేవలం 20 స్థానాలు ఉండి బీజేపీ ఒక్కటి గెలవలేని కేరళ రాష్ట్రమా? అన్నది స్పష్టంచేయాలి’ అని విశ్వం అన్నారు. వాయనాడ్‌ ప్రజలకు వారి ఎంపీ అందుబాటులో లేకుండా పోయారని, అందుకు కారణం ఆయన అవసరం జాతీయ స్థాయిలో ఎక్కువగా ఉండటమేనని చెప్పారు.
అలాంటి వ్యక్తిని వాయనాడ్‌ నుంచి పోటీకి బలవంతం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేరళలోని సీపీఎం`ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో సీపీఐ కీలక భాగస్వామి అని వినయ్‌ విశ్వం చెప్పారు. ఎల్డీఎఫ్‌పై ఆరోపణలు కొత్తేమీ కాదని, వాటిని విజయవంతంగా ఎల్డీఎఫ్‌ అధిగమించగలదన్నారు. ఎల్డీఎఫ్‌ నిజాయితీ ప్రజలకు తెలుసునని, దానికి అండగా నిలుస్తారన్నారు. కేరళలో రెండంకెల విజయాన్ని బీజేపీ నమోదు చేస్తుందని ప్రధాని మోదీ హాస్యం పడిరచారని ఎద్దేవా చేశారు. కేరళలో బీజేపీ రెండంకెల విజయం సాధిస్తుందనడం హాస్యాస్పదమని, అదే జరిగితే కేరళలో కాకి తలకిందులుగా ఎగురుతుందని వినయ్‌ విశ్వం వ్యంగ్యంగా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img