భానుడి భగభగలు మొదలైన నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే స్కూళ్లు పనిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్ కూడా తప్పనిసరిగా ఈ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.